ntr: త్వరలో 'బిగ్ బాస్' హౌస్ లోకి 'జై లవ కుశ' టీమ్!

తెలుగు 'బిగ్ బాస్' షో .. కొన్ని విషయాల్లో హిందీ 'బిగ్ బాస్' షో నే అనుసరిస్తోంది. అందులో భాగంగానే ఆయా సినిమాల ప్రమోషన్స్ కు 'బిగ్ బాస్' షో కూడా ఒక వేదికగా మారింది. ఈ మధ్య కాలంలో రానా .. తాప్సి .. విజయ్ దేవరకొండ వంటి వారు తమ సినిమాల ప్రమోషన్స్ కోసం 'బిగ్ బాస్' హౌస్ లోకి అడుగుపెట్టారు.

అలాగే త్వరలో 'జై లవ కుశ' సినిమా టీమ్ కూడా 'బిగ్ బాస్' హౌస్ లోకి రానున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు 'బిగ్ బాస్' షోకి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అదే షోకి ప్రమోషన్స్ కోసం ఆయన సినిమా టీమ్ రానుండటం విశేషం. బయ్యర్ల ఒత్తిడి పైనే కల్యాణ్ రామ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఎలాంటి కాన్సెప్ట్ తో 'బిగ్ బాస్' హౌస్ లో 'జై లవ కుశ ' టీమ్ సందడి చేస్తుందో చూడాలి. సెప్టెంబర్ 21వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.    

More Telugu News