: వచ్చే నెల 1న తిరుమలలో రాష్ట్రపతి పర్యటన

భారత రాష్ట్రపతి హోదాలో రామ్ నాథ్ కోవింద్ తొలిసారిగా తిరుమలను సందర్శించనున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం తిరుమలకు చేరుకుని, మర్నాడు ఉదయం స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కాగా, తిరుపతి స్విమ్స్ లో నిర్వహించే ఓ కార్యక్రమంలో రామ్ నాథ్ కోవింద్ పాల్గొననున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

More Telugu News