charan: భారీ సెట్లో చరణ్, సమంతలపై షూటింగ్

సుకుమార్ దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతోంది. సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకుంది. నదీ తీరంలోని గ్రామీణ ప్రాంతంలో నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరణ కష్టమవుతుంది కనుక, హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో భారీ సెట్ వేశారు. నదీ తీరంలో గల గ్రామం సెట్ వేసి చిత్రీకరణను కొనసాగిస్తున్నారు.

చరణ్, సమంతలతో పాటు జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, ఆది పినిశెట్టి షూటింగులో పాల్గొంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నట్టుగా యూనిట్ సభ్యులు చెప్పారు. అయితే కొన్ని కారణాల వలన ఆలస్యమయ్యే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.     

More Telugu News