: 1000 రూపాయల నోటు తెచ్చే ఆలోచన లేదు: కేంద్ర మంత్రి

తాజాగా ఆర్బీఐ 200 రూపాయల నోటు, 50 రూపాయల నోట్లను మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 1000 రూపాయల కొత్త నోట్లు మళ్లీ మార్కెట్ లోకి రానున్నాయంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇవి వైరల్ గా మారడంతో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుతూ, వెయ్యి రూపాయల నోట్లను తిరిగి ప్రవేశపెట్టే ఆలోచనలేదని అన్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవాలు కాదని ఆయన చెప్పారు. 

More Telugu News