: చంద్రబాబుపై విమర్శలు చేస్తే మీ రెక్కలు ఊడగొడతారు: వైసీపీ నేతలపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్

నంద్యాల ఉపఎన్నికల ఫలితాల ద్వారా వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఊడగొట్టిన ప్రజలు, చంద్రబాబుపై విమర్శలు చేసే నేతల రెక్కలు కూడా ఊడగొడతారంటూ ఆ పార్టీ నేతలపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. నంద్యాల ఎన్నికలు రిఫరెండమని పిచ్చి కూతలు కూసిన వైసీపీ నేతలు, ఫలితాలు వచ్చాక మాటలు మార్చారని విమర్శించారు.

వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నానిలు ఐరన్ లెగ్ లని, చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని అన్నారు. గుడివాడ ఎమ్మెల్యే నాని తన పదవికి రాజీనామా చేస్తే తమ పార్టీ తరపున సామాన్య కార్యకర్తను ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకుంటామని, అందుకు, నాని సిద్ధమేనా? అంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.

More Telugu News