: నా అప్‌డేట్స్ కోసం ఇక‌పై ఈ ట్విట్ట‌ర్ పేజ్‌ను చూడండి: ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు

త‌‌న‌కు సంబంధించిన‌ అప్‌డేట్స్ కోసం ఇక‌పై వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్ట‌ర్ పేజ్‌ను చూడండని ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ ట్విట్ట‌ర్ పేజ్‌లో ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌తిరోజు హాజ‌ర‌వుతున్న కార్య‌క్ర‌మాల వివ‌రాలు, ఫొటోల‌ను పోస్ట్ చేస్తున్నారు. రాజ్య‌స‌భ‌కు కొత్త‌గా ఎన్నికైన వారితో ఈ రోజు వెంక‌య్య నాయుడు ప్ర‌మాణ స్వీకారం చేయించారని అందులో పేర్కొన్నారు. మరోవైపు వెంకయ్య నాయుడి వ్యక్తిగత ఖాతా కూడా కొనసాగుతోంది. 

More Telugu News