: రెండు కేసుల్లో బాబా రామ్ పాల్ ను నిర్దోషిగా తేల్చిన హిస్సార్ కోర్టు!

రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం, హింస‌కు కార‌ణం అవ్వ‌డం, 2006లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడుగా ఉండ‌డం వంటి కేసుల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న బాబా రామ్ పాల్ కి ఈ రోజు హర్యానాలోని హిస్సార్ కోర్టులో కాస్త ఊర‌ట ల‌భించింది. మొత్తం 5 కేసుల్లో నిందితుడుగా ఉన్న ఆయ‌న రెండు కేసుల్లో నిర్దోష‌ని కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. దీంతో ఆయ‌న‌ మ‌రో మూడు కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. ఆయా కేసుల్లో పలుసార్లు ఆయన కోర్టు నుంచి వచ్చిన నోటీసులను పట్టించుకోకుండా, కోర్టుకు హాజరుకాకుండా ఉండడంతో ఆయనను గతంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
 

More Telugu News