anu emmanuel: వచ్చే ఏడాదిపైనే అనూ ఇమ్మాన్యుయేల్ ఆశలు!

తెలుగులో కుర్రకారు ప్రేక్షకుల హృదయాలను దోచేసిన కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. 'మజ్ను' .. 'కిట్టు వున్నాడు జాగ్రత్త' సినిమాలతో ఈ సుందరి హిట్లు కొట్టేసింది. గోపీచంద్ జోడీగా ఈ అమ్మాయి నటించిన 'ఆక్సిజన్' అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా రిజల్ట్ గురించి అనూ పెద్దగా ఆలోచించడం లేదట. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలపైనే ఆమె ఆశలు పెట్టుకుందని అంటున్నారు.

 ప్రస్తుతం ఆమె పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో చేస్తున్న సినిమా .. బన్నీ జోడీగా చేస్తున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు ఘన విజయాలను సాధిస్తాయనీ .. తన కెరియర్ మరింత స్పీడ్ అందుకుంటుందనే నమ్మకంతో అనూ ఇమ్మాన్యుయేల్ ఉందని చెబుతున్నారు.  

More Telugu News