vijay devarakonda: తొలి మూడు రోజుల్లో 'అర్జున్ రెడ్డి' వసూళ్లు!

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'అర్జున్ రెడ్డి' .. క్రితం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షాలిని పాండే కథానాయికగా నటించిన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. తొలి మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

 నైజామ్ లో 3.58 కోట్లు .. సీడెడ్ లో 95 లక్షలు .. నెల్లూరులో 18 లక్షలు .. గుంటూరులో 45 లక్షలు .. కృష్ణాలో 55 లక్షలు .. పశ్చిమ గోదావరిలో 25 లక్షలు .. తూర్పు గోదావరిలో 54 లక్షలు .. వైజాగ్ లో 65 లక్షలను రాబట్టింది. ఇలా ఈ సినిమా తొలి మూడు రోజుల్లో 7.15 కోట్లను వసూలు చేసింది. ఇక అమెరికాలోను ఈ సినిమా వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయినట్టేననే టాక్ వినిపిస్తోంది.   

More Telugu News