: పెద్ద హీరోల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి!: '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వి హెచ్చరిక

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అతని అభిమానులపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన విమర్శలపై సినీ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి మండిపడ్డారు. గొప్ప నటులపై విమర్శలు చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని అన్నారు. పవన్ కల్యాణ్ గురించి ఆయనకు ఏమి తెలుసని ప్రశ్నించారు. గొప్పవారిని విమర్శించే ముందు మన స్థాయి ఏంటనేది ఆలోచించుకోవాలని అన్నారు.

ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాయడం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడటం సరికాదని చెప్పారు. సినిమా గురించి మాట్లాడటంతో తప్పు లేదని... వ్యక్తిగత విమర్శలు చేయడం మాత్రం చాలా తప్పని అన్నారు. పరిధులు దాటి మాట్లాడితే, వారి ఫ్యాన్స్ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. పెద్ద హీరోల గురించి రాసేటప్పుడు మనమేంటో తెలుసుకోవాలని... చద్దన్నం తినేసి ఏదేదో రాసేస్తామంటే కుదరదని అన్నారు. 

More Telugu News