balakrishna: లేట్ నైట్ పార్టీలో పూరీ బ్యాచ్ తో బాలయ్య

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన 'పైసా వసూల్' సినిమా సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ఆడియో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని నమ్మకంతో టీమ్ వుంది. టీజర్స్ తో .. ఆడియో సక్సెస్ తో వచ్చిన రెస్పాన్స్ వాళ్ల నమ్మకానికి మరింత బలాన్ని చేకూర్చింది.

 దాంతో ఈ సినిమా టీమ్ ఆడియో సక్సెస్ మీట్ ఫంక్షన్ జరిగిన రోజు రాత్రి పార్టీని ఏర్పాటు చేసింది. పూరి .. ఛార్మి .. ఈ సినిమా కథానాయికలు ఈ పార్టీలో వున్నారు. సాధారణంగా ఇలాంటి పార్టీలకు దూరంగా ఉండే బాలకృష్ణ, ఈ సారి ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. లేట్ నైట్ వరకూ కొనసాగిన ఈ పార్టీలో ఆయన సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   

More Telugu News