charan: బోయపాటి నెక్స్ట్ మూవీ చరణ్ తోనే!

గీతా ఆర్ట్స్ బ్యానర్లో 'సరైనోడు' చేసిన బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ ఖాతాలో ఓ సూపర్ హిట్ వేశాడు. ఆ తరువాత 'జయ జానకి నాయక' చేసి హిట్ కొట్టిన బోయపాటి, తన తదుపరి సినిమాను మళ్లీ గీతా ఆర్ట్స్ లోనే చేయనున్నట్టు తెలుస్తోంది. చరణ్ కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్న చరణ్, ఆ తరువాత బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత బోయపాటి సినిమా చిరంజీవితో వుండే ఛాన్స్ వుంది. ఇది కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే తెరకెక్కనుంది. మొత్తానికి బోయపాటి పెద్ద గ్యాప్ లేకుండా మెగా హీరోలతో .. గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేస్తూ వస్తుండటం విశేషం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయనున్నారు.     

More Telugu News