ram: ఇటలీ వెళుతోన్న 'ఉన్నది ఒకటే జిందగీ'!

రామ్ .. కిషోర్ తిరుమల కాంబినేషన్లో 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా రూపొందుతోంది. స్నేహం .. ప్రేమ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది. కొన్ని రోజులుగా ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు.

 ఇక ఇక్కడి షెడ్యూల్ పూర్తికానుంది. దీంతో ఒక పాట మాత్రమే పెండింగ్ ఉంటుంది. త్వరలో ఈ పాటను చిత్రీకరించడానికి ఇటలీ వెళ్లనున్నారు. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ .. లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. కృష్ణ చైతన్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రామ్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.     

More Telugu News