Tapsi: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  ఇటీవల విడుదలైన 'ఆనందో బ్రహ్మ' చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే, ఇందులో హీరోయిన్ గా నటించిన తాప్సీ పైసా కూడా పారితోషికం తీసుకోలేదట. కథ నచ్చడం వల్ల పారితోషికం లేకుండా చేస్తానని, సినిమా హిట్టయ్యాక లాభాల్లో షేర్ ఇమ్మని అడిగిందట. దీంతో ఇప్పుడు ఆమెకు భారీ మొత్తం అందనుందని అంటున్నారు.      
*  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర త్వరలో నిర్మాతగా మారనున్నట్టు సమాచారం. ఇటీవల పూరీ దర్శకత్వం వహించిన 'పైసా వసూల్' చిత్రం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పవిత్ర పనిచేసింది.  
*  'పెళ్లిచూపులు' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇన్నాళ్లకు తన రెండో చిత్రాన్ని చేస్తున్నాడు. స్నేహం విలువను చెబుతూ, కొత్త వాళ్లతో నలభై ఐదు రోజుల్లో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు భాస్కర్ తెలిపాడు.  
*  శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహానుభావుడు' చిత్రం ఓవర్సీస్ హక్కులు మంచి రేటుకి వెళ్లాయి. 3.3 కోట్లకు ఈ హక్కులు అమ్ముడుపోయినట్టు సమాచారం.

More Telugu News