: డోక్లాం నుంచి చైనా బుల్డోజర్లు వెనక్కి వెళ్లాయి

డోక్లాం వివాదం ముగిసిందని భారత్ ప్రకటించిన వెంటనే భారత్ తోక ముడిచిందని, తన బలగాలను ఉపసంహరించుకుందని, తాము మాత్రం అక్కడ సైన్యాన్ని కొనసాగిస్తామని చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డోక్లాం నుంచి చైనా బుల్‌ డోజర్లు వెనక్కి వెళ్లిపోయాయని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డోక్లాంలో వివాదానికి కారణమైన రహదారి నిర్మాణం ఆగిపోయిందని భారత్ చెబుతోంది. బుల్ డోజర్లు, నిర్మాణ పరికరాలు వెనక్కి వెళ్లిపోయాయని భారత్ తెలిపింది.  

More Telugu News