akhil: హీరోయిన్ విషయంలోనే 'హలో' లేట్ అయిందన్న నాగ్!

తెలుగు తెరపై కథానాయకుడిగా నాగార్జున ప్రత్యేకమైన ముద్ర వేశారు. అగ్రకథానాయకుడిగా రాణిస్తూ అనేక విభిన్న చిత్రాలలో మెప్పించారు. అలాంటి నాగార్జున పుట్టిన రోజు .. రేపు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. అఖిల్ - విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా 'హలో' గురించి ప్రస్తావించారు.

 కథానాయిక ఎంపిక విషయంలో ఆలస్యం కావడం .. షూటింగుపై ప్రభావం చూపిందని అన్నారు. 'గీతాంజలి'లో గిరిజలా .. 'ఏం మాయ చేశావే'లో సమంతాలా కథానాయిక కొత్తగా అనిపించాలనే ఉద్దేశంతో, చాలామంది కథానాయికల పేర్లను పరిశీలించినట్టు చెప్పారు. చివరికి దర్శకుడు ప్రియదర్శన్ కూతురు 'కల్యాణి'ని కథానాయికగా తీసుకోవడం జరిగిందని అన్నారు. టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందనీ .. సినిమా కూడా అదే స్థాయిలో యూత్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.     

More Telugu News