gopichand: గోపీచంద్ 'ఆక్సిజన్'కు తొలగిన అడ్డంకులు!

గోపీచంద్ కథానాయకుడిగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో 'ఆక్సిజన్' చిత్రం తెరకెక్కింది. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగింది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో, ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఐశ్వర్య మాట్లాడుతూ .. గోపీచంద్ అభిమానులను ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందిందని చెప్పారు.

గోపీచంద్ కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని అన్నారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడనీ .. త్వరలోనే ఆడియో రిలీజ్ ఉంటుందని చెప్పారు. అక్టోబర్ 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నామని అన్నారు. గోపీచంద్ సరసన రాశి ఖన్నా .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా అలరించనున్నారు.  

More Telugu News