: తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు: బాలకృష్ణ
నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. భూమా బ్రహ్మానందరెడ్డికి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి కోసం కృషి చేస్తోన్న తమ పార్టీకి ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఈ విజయంతో మరోసారి స్పష్టమైందని పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీడీపీ శ్రేణులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. బాలయ్య ప్రకటనను యథాతథంగా ప్రచురిస్తున్నాం...