: శిల్పా సోదరులు చాలా గ్రేట్.. పదవికి రాజీనామా చేసి వచ్చారు!: జగన్

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చిన శిల్పా సోదరులు రాజకీయ విలువలకు అర్థం తీసుకొచ్చారని వైసీపీ అధినేత జగన్ ప్రశంసించారు. విలువలకు కట్టుబడి పదవికి రాజీనామా చేసిన శిల్పా సోదరులకు అభినందనలు తెలుపుకుంటున్నానని అన్నారు. వైసీపీ ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. ప్రలోభాలకు, భయభ్రాంతులకు అధికార పార్టీ గురి చేసినా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికను తాము రెఫరెండంగా భావించబోమని... తమ పార్టీ నుంచి వెళ్లిపోయి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలను నిర్వహించాలని... ఆ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తామని చెప్పారు. 

More Telugu News