alu arjun: ఎన్టీఆర్ తరువాత బన్నీతోనే చేస్తాడట!

దర్శకుడు బాబీ ప్రస్తుతం 'జై లవ కుశ' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పోస్టర్స్ కి .. టీజర్స్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. దాంతో హీరోగా ఎన్టీఆర్ .. నిర్మాతగా కల్యాణ్ రామ్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో బాబీ ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే అల్లు అర్జున్ కి ఆయన కథ వినిపించడం .. ఆ కథ నచ్చేసి చేద్దామని అల్లు అర్జున్ చెప్పేయడం జరిగిపోయాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ .. వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చేస్తున్నాడు. దీని తరువాత లింగుస్వామితో కలిసి ఆయన ఒక సినిమా చేయాల్సి వుంది. ఆ ప్రాజెక్టు తరువాత బాబీతో సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు. మొత్తానికి 'జై లవ కుశ' విడుదల కాకముందే బాబీ .. బన్నీని లైన్లో పెట్టేశాడన్న మాట.    

More Telugu News