sundar: 'సంఘమిత్ర' ఆగిపోయిందా? వెనక్కి పోయిందా?

శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ వారు సుందర్ .సి దర్శకత్వంలో 'సంఘమిత్ర' సినిమాను నిర్మించాలనుకున్నారు. 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మితం కానున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రకి గాను శ్రుతి హాసన్ ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి తాను తప్పుకుంటున్నట్టుగా శ్రుతి హాసన్ ప్రకటించింది.

 దాంతో హన్సిక పేరు తెరపైకి వచ్చింది. తాను ఈ సినిమా చేయడం లేదంటూ రీసెంట్ గా హన్సిక చెప్పింది. ఇక సుందర్ కూడా గతంలో తాను చేసిన 'కల కళప్పు'కు సీక్వెల్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడట. గతంలో చేసిన అంజలి .. ఓవియాలను హీరోయిన్లుగా తీసుకున్నాడని అంటున్నారు. ఇలా సుందర్ ఈ సీక్వెల్ పనులు మొదలుపెట్టడంతో, 'సంఘమిత్ర' ప్రాజెక్టు ఆగిపోయిందా? వెనక్కిపోయిందా? అనే సందేహం అందరిలో తలెత్తుతోంది.      

More Telugu News