: మరోమారు నిజం కానున్న ‘లగడపాటి’ జోస్యం

ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు గాంచిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పిన జోస్యం మరోమారు నిజం కానుంది. నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం అని లగడపాటి ఇటీవల నిర్వహించిన ఆర్జీ ఫ్లాష్ సర్వే ద్వారా చెప్పారు. తాజాగా, వెలువడుతున్న నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఫలితాలు కూడా ఈ సర్వే నిజమే అని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు పూర్తయిన అన్ని రౌండ్లలో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదటి రౌండ్ నుంచి పదిహేనవ రౌండ్ వరకు టీడీపీ తన ఆధిక్యతను కొనసాగిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఓ పత్రికతో లగడపాటి మాట్లాడుతూ, ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందునే పోలింగ్ శాతం పెరిగిందని అన్నారు. 

More Telugu News