: ముఖ్య నేతల వద్ద తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కిన జగన్?

నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలను పార్టీ ముఖ్యనేతలో కలసి వైసీపీ అధినేత జగన్ హైదరాబాదు, లోటస్ పాండ్ లోని తన నివాసంలో సమీక్షించారు. ఈ సందర్భంగా, ఈ ఎన్నికలో గెలుపు ఖాయమనుకున్న తరుణంలో... ఫలితాలు తీవ్ర నిరాశాజనకంగా రావడంపై జగన్ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కినట్టు సమాచారం. 15 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ... సమయం మొత్తాన్ని చంద్రబాబును తిట్టడానికే జగన్ కేటాయించారని... వైసీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు 12వ రౌండ్ లో కూడా టీడీపీ 1580 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.

More Telugu News