: యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది భారతీయులు దుర్మరణం.. విప్రోలో విషాదం!

బ్రిటన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గత 24 ఏళ్లలో ఇదే అత్యంత ఘోర రోడ్డు ప్రమాదమని అధికారులు తెలిపారు. బకింగ్‌హామ్‌షైర్‌లోని న్యూపోర్ట్ పాగ్నెల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విప్రో ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న మినీబస్ అదుపు తప్పి రెండు లారీలను ఢీకొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురు విప్రో ఉద్యోగులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ కూడా భారతీయుడే. మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు లారీ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు పెట్టిన పోలీసులు నేడు (సోమవారం) కోర్టులో హాజరు పరచనున్నారు. నవంబరు, 1993 తర్వాత బ్రిటిష్ మోటార్ వేపై జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు. ఆ ప్రమాదంలో 12 మంది చిన్నారులు, వారి టీచర్ ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News