: కాకినాడలో ముగిసిన ఎన్నికల ప్రచారం!

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు తమ ప్రచారాలను ఎన్నికల నిబంధనల మేరకు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల లోపే ముగించారు. కాకినాడ కార్పొరేషన్ పోలింగ్ ఈ నెల 29న జరగనుండగా, సెప్టెంబర్ 1న కౌంటింగ్ జరుగుతుంది. కాగా, టీడీపీ, వైసీపీలు తమ గెలుపు ఖాయమంటూ ఆయా పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాకినాడలోని 48 స్థానాల్లో తమ గెలుపు ఖాయమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేయగా, మూడున్నరేళ్ల పాలనలో కాకినాడకు ఏం ఒరగబెట్టని చంద్రబాబుకు ఓటమి తప్పదని వైసీపీ అధినేత జగన్ అన్నారు.

More Telugu News