ntr: త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుథ్!

ప్రస్తుతం ఎన్టీఆర్ .. బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' చేస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నారు.

ఎన్టీఆర్ సరసన కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఆమె త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో చేస్తోంది. ఇదే సినిమాకి పనిచేస్తోన్న అనిరుథ్ రవిచంద్రన్ కి కూడా త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. అంటే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాకి కూడా సంగీతాన్ని అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తాడన్న మాట. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.   

More Telugu News