: ముగ్గురు పాకిస్థాన్ రేంజర్లను హతమార్చిన భారత ఆర్మీ!
పాకిస్థాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. సరిహద్దు వద్ద కాల్పులకు తెగబడుతూ భారత్ను రెచ్చగొడుతోంది. జమ్ముకశ్మీర్లోని పర్గ్వాల్లో పాకిస్థాన్ రేంజర్లు ఈ రోజు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. పాకిస్థాన్ రేంజర్ల కాల్పులను భారత ఆర్మీ తిప్పికొట్టింది. దీంతో ముగ్గురు పాకిస్థాన్ రేంజర్లు హతమయ్యారు.
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ సరిహద్దు వద్ద కాల్పులు జరుపుతోంది. ఉగ్రవాదులను అణచివేయాలని అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్న పాకిస్థాన్కి ఏం చేయాలో తోచడం లేదు. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల వద్ద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల భారత్, పాక్ సరిహద్దు ప్రాంతం వద్ద పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతుండడంతో ఆ ప్రాంతాల ప్రజలను భారత ఆర్మీ అక్కడి నుంచి తరలించింది.