dil raju: సామాన్యులకు కూడా ప్రివ్యూ షో చూసే అవకాశం కల్పిస్తున్న దిల్ రాజు!

సాధారణంగా ఏదైనా ఒక సినిమా విడుదలకి ముందు మీడియా వారినీ, సినిమా వారిని ఆహ్వానించి స్పెషల్ ప్రివ్యూ వేస్తుంటారు. ఆ సినిమాకి సంబంధించిన టాక్ బయటికి వెళితే, పెద్ద సంఖ్యలో థియేటర్స్ కి జనం వస్తారని భావిస్తూ వుంటారు. అయితే 'వెళ్లిపోమాకే' సినిమా ప్రివ్యూ విషయంలో నిర్మాత దిల్ రాజు కొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.

 ఈ సినిమా ప్రివ్యూలను సామాన్య ప్రేక్షకులు కూడా వచ్చి చూసేలా ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడని అంటున్నారు. ఎంతమంది వస్తే అంత మందికీ ప్రివ్యూలు వేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా చెబుతున్నారు. మొదటి ప్రివ్యూను రేపు సాయంత్రం 6 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్ లో వేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ ను కూడా వదిలారు. ఈ సినిమా గురించి ఎంత ఎక్కువ మంది మాట్లాడుకుంటే అంత మంచిదనే ఆలోచనలో దిల్ రాజు వున్నాడని చెప్పుకుంటున్నారు.  సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.   

More Telugu News