: ముఖేష్ అంబానీనా మజాకా.. పార్టీకి టెండూల్కర్ సహా బాలీవుడ్ తారాగణం మొత్తం తరలి వచ్చింది!

గణేష్ చతుర్థి సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నిన్న రాత్రి భారీ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బాలీవుడ్ తారాగణం మొత్తం తరలివచ్చింది. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకునే, రణవీర్ సింగ్, ప్రియాంకాచోప్రా, రణబీర్ కపూర్, కరణ్ జొహార్, కాజోల్, హేమమాలిని తదితరులు పార్టీలో సందడి చేశారు. సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమారుడు అర్జున్ లతో కలసి వచ్చాడు. సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్, శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ లు కూడా పార్టీలో హల్ చల్ చేశారు. 

More Telugu News