vijay devarakonda: తెలుగు రాష్ట్రాల్లో 'అర్జున్ రెడ్డి' తొలిరోజు వసూళ్లు!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'అర్జున్ రెడ్డి' .. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షాలిని పాండే కథానాయికగా నటించిన ఈ సినిమా, తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది.

 నైజామ్ లో 1.22 కోట్లు .. సీడెడ్ లో 33 లక్షలు .. ఉత్తరాంధ్రలో 21 లక్షలు .. ఈస్ట్ గోదావరిలో 12 లక్షలు .. వెస్ట్ గోదావరిలో 9 లక్షలు .. కృష్ణాలో 25 లక్షలు .. గుంటూరులో 20 లక్షలు .. నెల్లూరులో 5 లక్షలను రాబట్టింది. ఇలా ఈ సినిమా తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 47 లక్షలను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కెరియర్లో మరో హిట్ నమోదైనట్టేననే టాక్ వినిపిస్తోంది.    

More Telugu News