: `సాహో` చిత్రానికి సంబంధించి మ‌రో అప్‌డేట్‌!

బాహుబ‌లి 2 త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న `సాహో` చిత్రానికి సంబంధించి కొత్త‌గా మ‌రో అప్‌డేట్ తెలిసింది. ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు అరుణ్ విజ‌య్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అరుణ్ విజ‌య్ ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు. `ప్ర‌భాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నందుకు ఆనందంగా ఉంది. `సాహో` బృందంలో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉంది` అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఇప్ప‌టికే ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి శ్రద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. జాకీ ష్రాఫ్ కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

More Telugu News