nagarjuna: గ్యాంగ్ స్టర్ పాత్రలో వెంకటేశ్ కి బదులుగా నాగార్జున?

తమిళనాట ఈ మధ్య కాలంలో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలలో 'విక్రమ్ వేదా' ఒకటిగా కనిపిస్తుంది. మాధవన్ .. విజయ్ సేతుపతి కథానాయకులుగా నటించిన ఈ సినిమాకి పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మాధవన్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించగా, విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ గా మెప్పించాడు.

ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి నిర్మాత శశికాంత్ ప్రయత్నిస్తున్నారు. మాధవన్ పాత్రలో రానా .. విజయ్ సేతుపతి పాత్రలో వెంకటేశ్ నటించే ఛాన్స్ ఉందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టు పట్ల వెంకటేశ్ పెద్దగా ఆసక్తిని చూపించలేదట. దాంతో ఆ పాత్ర తీరు తెన్నుల గురించి నాగార్జునకి వివరించారట. మొదటి నుంచి కూడా ప్రయోగాత్మక పాత్రల పట్ల ఆసక్తిని చూపిస్తూ వస్తోన్న నాగార్జున, విజయ్ సేతుపతి పాత్రను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.       

More Telugu News