: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే.. 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి భారతీయ రైల్వే నడుం బిగించింది.  మొత్తం 19,952 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి  పాసైన 18-25 సంవత్సరాల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మొత్తం ఉద్యోగాల్లో 8901 జనరల్ కేటగిరీకి, 4371కి ఓబీసీకి, ఎస్టీకి 3363, ఎస్సీకి 3317 ఉద్యోగాలను కేటాయించింది. గడువు, మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.

More Telugu News