rana: తేజ .. రానాలకు చెరో 5 కోట్లు?

రానా కథానాయకుడిగా దర్శకుడు తేజ ఇటీవల 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. దాదాపు 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారట. కథా .. కథనాలతో పాటు రానా పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దాంతో విడుదలైన అన్ని ప్రాంతాల్లోను ఈ సినిమా విజయవిహారం చేసేసింది. అంచనాలకి మించి భారీ వసూళ్లను రాబట్టేసింది.

దాంతో ఈ సినిమాకి 25 కోట్ల వరకూ లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం లాభాల్లో వాటాగా దర్శకుడు తేజకు .. హీరో రానాకు చెరో 5 కోట్లు వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. లాభాల్లో వాటా సంగతి అటుంచితే తేజ .. రానాల కెరియర్లో ఒక వైవిధ్యభరితమైన చిత్రంగా 'నేనే రాజు నేనే మంత్రి' నిలిచిపోవడం విశేషం.      

More Telugu News