: అసలు, అభిరుచి మధుకు గన్ లైసెన్స్ ఎవరిచ్చారు?: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

నడిరోడ్డులో కాల్పులకు తెగబడుతుంటే పట్టించుకోరా? టీడీపీ నేత అభిరుచి మధుకు గన్ లైసెన్స్ ఎలా ఇచ్చారు? అంటూ వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. నంద్యాలలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘటనపై ఆయన స్పందిస్తూ.. మధు వర్గీయులే తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని, మధు రౌడీ షీటర్ అని ఆరోపించారు.

నిబంధనల ప్రకారం డిపాజిట్ చేసిన గన్ తో కాల్పులు జరుపుతారా? అని ప్రశ్నించిన ఆయన, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంలో కాల్పులు జరపడం పెద్ద నేరమని అన్నారు. ఇటువంటి వారికి గన్ మెన్లను ఇవ్వడం, నిబంధనలకు విరుద్ధంగా వారు వ్యవహరించడం దారుణమని అన్నారు. ఒకవేళ ఈ కాల్పుల్లో సామాన్య ప్రజలు చనిపోయి ఉంటే దానికి ఎవరు సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

More Telugu News