: ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను విస్తరించనున్నట్టు జీఎమ్మార్ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, విమానాశ్రయ విస్తరణకు ఇప్పటికే అనుమతులు పొందామని జీఎమ్మార్ సీఈఓ తెలిపారు. విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న టర్మినల్స్ సామర్థ్యం పెంచుతామని, కొత్తగా మరో రన్ వే అందుబాటులోకి తీసుకువస్తామని, ఢిల్లీ మెట్రో రైల్ ను కూడా అన్ని టర్మినల్స్ కు అనుసంధానించేలా విస్తరిస్తున్నామని, ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.















 

More Telugu News