: పళనిస్వామి స్థానంలో సెంగోట్టయాన్‌ను సీఎం చేయండి.. ప్రభుత్వాన్ని కూల్చబోం: దిన‌క‌ర‌న్

త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామితో ప‌న్నీర్ సెల్వం ఇటీవ‌లే చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శ‌శిక‌ళ‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. అన్నాడీఎంకేలోని 19 మంది ఎమ్మెల్యేలను త‌నవైపున‌కు తిప్పుకున్న దిన‌క‌ర‌న్ అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ ప‌రీక్ష‌ జ‌ర‌పేలా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు. ఇప్ప‌టికే ఆ 19 మంది ఎమ్మెల్యేలు తమకు పళనిస్వామి ప్రభుత్వంపై విశ్వాసం లేదని గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు లేఖ రాశారు. కాగా, తాజాగా దిన‌క‌ర‌న్ అన్నాడీఎంకే ప్ర‌భుత్వానికి ఓ ఆఫ‌ర్ ఇచ్చారు.

ప‌ళ‌నిస్వామి స్థానంలో సెంగోట్టయాన్‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని దిన‌క‌ర‌న్‌ ప్ర‌తిపాదించారు. అలా చేస్తే తాము అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే కొనసాగుతామని, ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌బోమ‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు త‌మ‌కు మ‌ద్ద‌తు తెలపాల‌ని ఈపీఎస్ వ‌ర్గం ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలతో చ‌ర్చ‌లు జ‌ర‌పుతోంది. 

More Telugu News