bellamkonda: 'జయ జానకి నాయక'లో ఆ సీన్ హైలైట్ అంటున్నారు!

'జయ జానకి నాయక' సినిమా కోసం నదీ ప్రవాహం .. సముద్రంలో కలిసే చోట ఫైట్ ను చిత్రీకరించాలని బోయపాటి శ్రీను అనుకున్నారట. అందుకోసం ఆయన కొన్ని ప్రదేశాలను పరిశీలించిన తరువాత 'హంసలదీవి' (కృష్ణానది సముద్రంలో కలసే ప్రదేశం)ని ఎంచుకున్నారు. 50 హోమాలు ఒకేసారి జరుగుతున్నట్టుగా సెట్ వేయించి .. హీరోతో యాక్షన్ ఎపిసోడ్ కి రంగాన్ని సిద్ధం చేశారు.

 జూనియర్ ఆర్టిస్టులు .. ఫైటర్లు .. బాడీ బిల్డర్లు ఇలా మొత్తంగా కలుపుకుని 600 మందితో ఇక్కడి సీన్ ను తెరకెక్కించారు. 8 జనరేటర్లు .. నీళ్లలో తడిసినా షాక్ కొట్టని కరెంట్ వైర్లను ఉపయోగిస్తూ, 13 రోజుల పాటు ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారట. ఇందుకోసం 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారు. ఇంతగా కష్టపడ్డారు కనుకనే ఈ సీన్ వీలైనన్ని విజిల్స్ ను సొంతం చేసుకుంటోంది .. ఈ సినిమాకి హైలైట్ అనిపించుకుంటోంది.    

More Telugu News