: మార్కెట్‌లోకి మ‌రో చైనా ఫోను.. ఆస‌క్తి క‌లిగించే ఫీచ‌ర్లు

షియోమి, ఒప్పో, వీవో స్మార్ట్‌ఫోన్లకు దీటుగా చైనా మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ కూల్‌ప్యాడ్ మ‌రో స్మార్ట్‌ఫోన్‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేయనుంది. కూల్‌ ప్లే 6 పేరుతో తీసుకొస్తున్న ఈ మొబైల్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దుబాయ్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే కూల్‌ ప్లే 6ను చైనాలో విడుదల చేశారు. దీని ధర సుమారు రూ.14,000. కూల్‌ ప్లే 6లో ఉన్న వివిధ ప్రత్యేకతలు ఆస‌క్తి క‌లిగిస్తున్నాయి. ఇందులో 5.5 అంగుళాల ట‌చ్‌స్క్రీన్‌, 1.4 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్‌తో పాటు 64జీబీ అంతర్గత మెమొరీ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 7.1.1 ఆప‌రేటింగ్ సిస్టంతో ఇది ప‌నిచేయ‌నుంది. 13 మెగా పిక్సెల్‌ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరాల‌తో పాటు బ్యాటరీ సామర్థ్యం 4060 ఎంఏహెచ్‌గా ఉంది.

More Telugu News