: టీమిండియా లక్ష్యం 217 పరుగులు

దంబుల్లాలో శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు లక్ష్యం 217  పరుగులు. శ్రీలంక జట్టు 43.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. కాగా, టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా, శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది.

శ్రీలంక బ్యాటింగ్: డిక్ వెల్లా (64), గుణతిలకా(35), మెండీస్ (36), తరంగా (13), సీకే కప్గెదెరా (1), పీడబ్ల్యుహెచ్ డిసిల్వా (2), ఎన్ఎల్టీసీ పెరెరా (0), సందకన్ (5), మలింగా (8), ఫెర్నాండో డకౌట్ కాగా, మాథ్యూస్ 36 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

భారత్ బౌలింగ్: బుమ్రా - 2, వైఎస్ చాహల్ - 2, జాదవ్ - 2, పటేల్ - 3

More Telugu News