: విజయవాడ ఆలయంలో చోరీ... అమ్మవారి ఆభరణాలను ఎత్తుకెళ్లిన దొంగలు

విజయవాడలోని ఓ అమ్మవారి గుడిలో గత రాత్రి దొంగతనం జరిగింది. కృష్ణలంకలోని రాణిగారితోట అమ్మవారి ఆలయంలోకి చొరబడిన దొంగలు ముక్కుపుడక, పాపిట బిళ్ల సహా 3 కాసుల బంగారు ఆభరణాలను దొంగిలించారు. ఈ ఉదయం ఆలయంలో దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన పూజారులు, స్థానికులు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఆలయం సమీపంలో అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలిస్తున్న పోలీసులు, ఇది పాత నేరస్తుల పని కావచ్చన్న అభిప్రాయానికి వచ్చారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

More Telugu News