: శత్రుసంహార హోమం ప్రారంభించిన టీటీవీ దినకరన్!
అన్నాడీఎంకే పార్టీలో తన పట్టు తగ్గిపోతున్న వేళ, శశికళ సలహాతో పార్టీ కార్యదర్శి టీటీవీ దినకరన్ శత్రుసంహార హోమాన్ని ప్రారంభించారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఒకటై, తమ కుటుంబాన్ని పక్కన బెట్టాలన్న నిర్ణయం తీసుకోవడంతో పాటు, శశికళను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా జయలలిత మరణంపై విచారణ, జయ పోయిస్ గార్డెన్ నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలని పళనిస్వామి సర్కారు నిర్ణయించిన వేళ, ఇది మింగుడు పడని దినకరన్, రాష్ట్రంలో పేరున్న పండితులను రప్పించి, ప్రత్యేక యజ్ఞయాగాలు ప్రారంభించారు.
శివగంగ జిల్లా పెరుమాళ్లు ఆలయం ఈ యాగానికి వేదికగా మారింది. ఈ యాగం పరిసమాప్తి అయ్యేసరికి పార్టీలో పరిస్థితులు తమ నేతకు అనుకూలంగా మారుతాయని ఆయన వర్గం నాయకులు చెబుతున్నారు. కాగా, మంగళవారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళనాడు పర్యటనకు రానుండగా, ఈ లోగానే ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల కలయిక పూర్తవుతుందని సమాచారం.