: న‌న్ను తొల‌గించ‌డానికి కార‌ణం `ఇందూ స‌ర్కార్‌` సినిమా... నిజాలు బ‌య‌ట‌పెడుతున్న సీబీఎఫ్‌సీ మాజీ చైర్మ‌న్‌

త‌న‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించిన విష‌యం ప్ర‌సూన్ జోషి చేరేంత‌వ‌ర‌కు త‌న‌కు చెప్ప‌లేద‌ని, `ఇందూ స‌ర్కార్‌` సినిమా విష‌యంలో వ‌చ్చిన విభేదాల వ‌ల్లే త‌నను ప‌ద‌వీచ్యుతుడిని చేసిన‌ట్లు సీబీఎఫ్‌సీ మాజీ చైర్మ‌న్ ప‌హ్లాజ్ నిహ‌లానీ తెలిపారు. ఆ సినిమాకు స‌ర్టిఫికెట్ జారీ చేయ‌కపోవ‌డంపై స్వ‌యంగా స‌మాచార ప్ర‌సారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ త‌న‌కు ఫోన్ చేశార‌ని ఆయ‌న చెప్పాడు.

ప‌హ్లాజ్ ప‌ద‌విలో ఉన్న‌పుడు `ఉడ్తా పంజాబ్‌` సినిమా మొద‌లుకొని `ఇందూ స‌ర్కార్‌` వ‌ర‌కు చాలా సినిమా క‌థ‌ల‌ను వివాదాస్ప‌దం చేస్తూ, స‌ర్టిఫికెట్ జారీ చేయ‌డంలో జాప్యం చేసేవార‌నే పేరు ఉంది. అలాగే `భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌` వంటి కొన్ని సినిమాల విష‌యంలో స్వ‌యంగా మంత్రిత్వ శాఖే స‌ర్టిఫికెట్ జారీని జాప్యం చేయాల‌ని ఆదేశించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఏదేమైనా ప‌హ్లాజ్ సీబీఎఫ్‌సీ చైర్మ‌న్‌గా ఉన్న‌పుడు చాలా సినిమాల్లో ముఖ్య‌మైన సీన్ల‌కు క‌త్తెర ప‌డింద‌న్న విష‌యం మాత్రం వాస్త‌వ‌మే.

More Telugu News