aishwarya: ధనుష్ మూవీ గురించి ఐశ్వర్య మౌనం ఎందుకో?

రజనీకాంత్ కూతురు సౌందర్య మెగా ఫోన్ చేతబట్టి ధనుష్ కథానాయకుడిగా 'విఐపి 2' సినిమాను తెరకెక్కించింది. నిర్మాణ సమయంలో ఉండగా ఈ సినిమా గురించి ధనుష్ భార్య, సౌందర్య సోదరి ఐశ్వర్య తెగ మాట్లాడేసింది. అయితే, ఈనెల 11వ తేదీన ఈ సినిమా తమిళనాట విడుదలై .. యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఐశ్వర్య ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా గురించి ఆమె ట్విట్టర్ లో కూడా ప్రస్తావించకపోవడం అయోమయానికి గురిచేస్తోంది. ఈ సినిమా ఆమెకి నచ్చలేదా? లేదంటే ఆమె సైలైంట్ అయిపోవడం వెనుక మరేదైనా కారణముందా? అనేది నెటిజన్ల మధ్య చర్చకు తెరతీసింది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన తెలుగులో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.   

More Telugu News