vijay devarakonda: 'అర్జున్ రెడ్డి' వెనుక అసలు కథ!

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'అర్జున్ రెడ్డి' సినిమా, ఈ నెల 25వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సందీప్ వంగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆయన మాట్లాడాడు. ఈ కథను ముందుగా శర్వానంద్ తో చేయాలనుకున్నానని చెప్పాడు. ఆయనకి కథ బాగా నచ్చిందనీ .. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా చేయలేకపోయాడని అన్నాడు.

 ఆ తరువాత విజయ్ దేవరకొండను సంప్రదించడం .. ఆయన ఓకే చెప్పడం జరిగాయని చెప్పాడు. ఇక ఈ సినిమాను నిర్మించడానికి ఎవరూ ముందుకు రాలేదనీ, దాంతో తన అన్నయ్య నిర్మాతగా వ్యవహరించాడని చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే ఈ సినిమా నుంచి ట్రైలర్ బయటికి వచ్చిందో .. అప్పటి నుంచి అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. చూడాలి మరి ఏ స్థాయి హిట్ కొడుతుందో! 

More Telugu News