taapsee: ఒక్కో పాత్రకి ఒక్కో ప్రత్యేకత .. అవే హైలైట్ : తాప్సీ

తాప్సీ ప్రధాన పాత్రగా మహి వి.రాఘవ దర్శకత్వంలో 'ఆనందో బ్రహ్మ' సినిమా తెరకెక్కింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందిందని చెప్పింది.

 ఈ సినిమాలో తనతో పాటు వెన్నెల కిషోర్ .. శ్రీనివాస్ రెడ్డి .. షకలక శంకర్ .. తాగుబోతు రమేష్ లు ప్రధానమైన పాత్రలను పోషించారని అంది. ఈ నాలుగు పాత్రలలో ఒక్కో పాత్రకి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని చెప్పింది. ఆ ప్రత్యేకతే ఈ పాత్రల నుంచి కావాల్సినంత కామెడీని ఇస్తుందనీ .. కావాల్సినంత భయాన్ని కలిగిస్తుందని అంది. అవే ఈ సినిమాకి హైలైట్ అవుతాయని చెప్పింది. తన కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకం వుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

More Telugu News