: కాకినాడ ఎన్నికలకు పచ్చజెండా ఊపిన హైకోర్టు

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కార్పొరేషన్ లో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ ల ఖరారును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 48 వార్డులకే ఎన్నికలను జరుపుతున్నారని...  మొత్తం 50 వార్డులకు ఎన్నికలను నిర్వహించాలని పిటిషన్ దారుడు కోరాడు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించింది.

More Telugu News