: చంద్రబాబు హయాంలోనే బాసర అభివృద్ధి జరిగింది: కేంద్ర మంత్రి సుజనా చౌదరి

ఉమ్మడి రాష్ట్రంలో సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర అభివృద్ధి చెందిందని కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి అన్నారు. తన కుటుంబసభ్యులతో కలసి ఈ రోజు ఆయన బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం, తన మనవడికి అక్కడ అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో సుజనా చౌదరి మాట్లాడుతూ, బాసరలో ఐఐటీ ఏర్పాటుకు చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేశారని అన్నారు. చంద్రబాబు తర్వాత వచ్చిన పాలకులు బాసర అభివృద్ధిపై శ్రద్ధ కనపరచలేదని విమర్శించిన ఆయన, ఈ పుణ్యక్షేత్రానికి మరింత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

More Telugu News