: దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్: మంత్రి నాయిని నర్సింహారెడ్డి

శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో దేశంలోనే  తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ గా ఉన్నారని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని డీసీపీ, ఏసీపీ పోలీస్ స్టేషన్ లను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, పోలీసులు సమర్ధవంతంగా పని చేస్తుండటంతో దొంగతనాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. పోలీస్ వ్యవస్థ ఎంత బాగా పని చేస్తే ప్రభుత్వానికి అంత మంచిపేరు వస్తుందని, పోలీసులకు అవసరమైన వాహనాలను సీఎం తక్షణమే మంజూరు చేశారని గుర్తు చేశారు. కార్పొరేట్ ఆఫీసుల తరహాలో పోలీస్ స్టేషన్లు ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, అందుకు అనుగుణంగానే పోలీస్ స్టేషన్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు.

More Telugu News