: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు.. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని

ఢిల్లీ హైకోర్టులో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వార్త బయటకు పొక్కడంతో, దేశ రాజధాని ఉలిక్కి పడిండి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జడ్జిలతో సహా కోర్టులో ఉన్నవారందరినీ బయటకు పంపించేశారు. పోలీసులతో పాటు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి అణువణువునూ క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతోంది. ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడకు చేరుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News